Gollagattu Jatara | ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 7: వచ్చే నెలలో జరుగబోతున్న గొల్లగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగనున్న గొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర సదస్సు పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. జాతరకు పూర్తికాల చైర్మెన్, కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతర సమయంలోనే పరిమితమైన నిధులు కాకుండా అధిక నిధులు కేటాయించి, సంవత్సరం పొడుగునా మౌళిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గొల్లగట్టు జాతరపై అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలను మానుకుని అక్కడ యాదవులు ఆశ్రిత కులాలైన బైకాని వారిని ప్రభుత్వం గుర్తించి, వేతనాలు చెల్లించాలన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వట్టె జానయ్య యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, లక్ష్మణ్యాదవ్, గడ్డం శ్రీనివాస్యాదవ్, కృష్ణయాదవ్, బారి అశోక్ యాదవ్, కడారి రమేశ్ యాదవ్, నూకల మధు, కాయిత సతీశ్, నానబాల సంతోష్యాదవ్, మహేశ్, శివశంకర్, సురేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా-ఈ కేసులో సుప్రీంకోర్టుకు కేటీఆర్..
Qatari Flight | 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత డమాస్కస్లో తొలి ఖతారీ ఫ్లైట్ ల్యాండ్..!
Stronger Legs | మీ కాళ్లు బలహీనంగా ఉన్నాయా.. వీటిని తినండి.. దృఢంగా మారుతాయి..!