సంగారెడ్డి : బసవేశ్వరుని 888 జయంతి వేడుకలను సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, అదనపు కలెక్టర్ రాజర్షి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై బసవేశ్వరుడి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సమాజంలో అహింస ద్వారా సమాజానికి మంచి మార్గాన్ని ఎన్నుకొని జీవించేలా బసవేశ్వడు బోధనలు చేశాడని గుర్తు చేశారు. అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నతంగా జీవించేవిధంగా బసవేశ్వరుడు బరోసా కల్పించా డన్నారు. సమాజ హితం కోసం పాటుబడిన బసవేశ్వరుడి మార్గం అందరికి ఆచరణీయమన్నారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పరిశీలన