పౌరస్పందనలో వరుసగా రెండోఏడాది టాప్
రెండు, మూడు స్థానాల్లో అహ్మదాబాద్, సూరత్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 31 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా ఖ్యాతినార్జిస్తున్న హైదరాబాద్ స్వచ్ఛ సర్వేక్షణ్లో ముందువరుసలో నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పౌర స్పందనలో వరుసగా రెండో ఏడాది దేశంలోనే టాప్లో నిలిచింది. బుధవారం ముగిసిన స్వచ్ఛ సర్వేక్షణ్ పౌర స్పందనలో అత్యధిక మార్కులతో హైదరాబాద్ మొదటిస్థానాన్ని దక్కించుకున్నది.
ఆరువేల మార్కుల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ స ర్వే నిర్వహిస్తారు. ఇందులో 2,400 మార్కులు సర్వీస్లెవల్ ప్రోగ్రెస్, 1,800 మార్కులు పౌరస్పందన ఆధారంగా తీసుకోగా.. మిగిలిన 1,800 మార్కులను సర్టిఫికేషన్ ఆధారంగా కేటాయిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకుల కోసం ప్రస్తుతం సర్వే కొనసాగుతున్నది. ఇందులోభాగంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు పౌర స్పందన ప్రక్రియను చేపట్టారు. పౌరులు తమ నగరానికి మద్దతుగా నిలిచేందుకు ‘ఓట్ ఫర్ యువర్ సిటీ’ యాప్ను డౌన్లోడ్ చేసుకోని అందులో తమ అభిప్రాయాన్ని నమోదుచేస్తారు.
నలభై లక్షల పైబడి జనాభా ఉన్న నగరాల్లో గుజరాత్లోని అహ్మదాబాద్తో గట్టిపోటీ నెలకొన్నప్పటికీ.. బుధవారం గడువు ముగిసే సమయానికి హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ దాదాపు 44 వేలకుపైగా మార్కులు ఎక్కువగా సాధించింది. రెండోస్థానంలో అహ్మదాబాద్, మూడోస్థానంలో సూరత్ నిలిచాయి. గతేడాది కూడా పౌర స్పందనలో హైదరాబాద్ నంబర్వన్గా నిలిచింది.
పౌర స్పందనలో మొదటి మూడు నగరాలకు వచ్చిన మార్కులు
నగరం మార్కులు
హైదరాబాద్ 9,47,163
అహ్మదాబాద్ 9,02,789
సూరత్ 4,79,115
ఇవి కూడా చదవండి:
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఎఫ్సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు