Telangana
- Dec 01, 2020 , 10:43:51
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీస్ ఉన్నతాధికారులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంబర్పేట ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ దంపతులు ఓటువేశారు. కుందన్బాగ్ చిన్మయి స్కూల్లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ దంపతులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు: సీపీ మహేశ్ భగవత్
ప్రశాంత వాతారణంలో ఎన్నికలు జరుగుతున్నాయని సీపీ మహేశ్ భగత్ అన్నారు. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం ఉన్నదని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచామన్నారు.
తాజావార్తలు
- 4,54,049 మందికి కోవిడ్ టీకా ఇచ్చేశాం..
- 10 కోట్ల డౌన్లోడ్లు సాధించిన మోజ్
- ఆటా ప్రెసిడెంట్గా భువనేశ్ బుజాల బాధ్యతల స్వీకరణ
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య
- ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!
- తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం : సీఎం కేసీఆర్
- ఆస్ట్రేలియా మాజీలకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?
- ట్రాక్టర్ల ర్యాలీపై వెనక్కి తగ్గం..
MOST READ
TRENDING