నల్లగొండ: కృష్ణా జలాలపై వివాదం నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసుల భద్రత కొనసాగుతున్నది. పటిష్ట భద్రత నడుమ సాగర్ ఎడమగట్టులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే విద్యుత్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. కాగా, ప్రాజెక్టులో వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి 31,131 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అంతే మొత్తంలో (31,131 క్యూసెక్యులు) నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా…ప్రస్తుతం 533 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయంలో 174.0610 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు.