హైదరాబాద్, ఏప్రిల్ 25: బీమా టెక్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన యాక్సెస్ మెడిటెక్ భారీగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించింది. సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో సయ్యద్ ఐజాజుద్దీన్ మాట్లాడుతూ..ఈ ఏడాది చివరిలోగా 30 శాతం నుంచి 40 శాతం వరకు ఉద్యోగులును పెంచుకోనున్నట్లు ప్రకటించారు. కొత్త మార్కెట్లు, కొత్త ఆవిష్కరణలే ఏజెండాగా పనిచేస్తున్న సంస్థ.. ఇందుకోసం నూతన టెక్నాలజీ నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నట్లు తెలిపారు.