మహదేవపూర్, సెప్టెంబర్ 22 : కొద్ది రోజులుగా వర్షాలు(Rains) తగ్గుముఖం పట్టడంతో మేడిగడ్డ బరాజ్కు (Medigadda barrage) వరద తగ్గింది. కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalapalli)మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు వరద స్వల్పంగా పెరిగింది(Flood rises). ఆదివారం 1,06,640 క్యూసెక్యుల ప్రవాహం రాగా, బరాజ్లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ప్రవాహం రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 90.20 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది.