హైదరాబాద్: సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా ప్రత్యేకంగా మరో ఐదు రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్పూర్-గువాహటి రైలు (06577) ఈ నెల 23న రాత్రి 10.40 గంటలకు ప్రారంభమవుతుందని, ఇది ప్రతి శుక్రవారం నడుస్తుందని చెప్పారు. గువాహటి-యశ్వంత్పూర్ రైలు (06578) ఈ నెల 26న రాత్రి 7.35 గంటలకు ప్రారంభమై ప్రతి సోమవారం నడుస్తుందని వెల్లడించారు.
కన్యాకుమారి-డిబ్రూగఢ్ ట్రెయిన్ (05905) ఈ నెల 24న సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై ప్రతి శనివారం నడుస్తుందని తెలిపారు. డిబ్రూగఢ్-కన్యాకుమారి రైలు (05906) 28న రాత్రి 7.25కి ప్రారంభమై ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. సమస్తిపూర్-యశ్వంత్పూర్ రైలు (06580) ఈ నెల 26న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై ప్రతి సోమవారం నడుస్తుందని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..