ఢిల్లీ: వరుసగా రెండు వన్డే ప్రపంచకప్లు గెలిచిన వెస్టిండీస్కు మరోసారి ఝలక్. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఆ జట్టు కోల్పోయింది. ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా అఫ్గాన్.. రెండో వన్డేలో గెలవడంతో విండీస్ ఆశలు అడియాసలయ్యాయి. వాస్తవానికి ఈ సిరీస్ను ఐర్లాండ్ 5-0 లేదా 4-1తో గెలిచి తర్వాత వెస్టిండీస్.. భారత్తో వన్డే సిరీస్ను 2-0తో నెగ్గితేనే కరీబియన్లకు ప్రపంచకప్లో డైరెక్ట్ క్వాలిఫికేషన్ దక్కేది.
కానీ తొలి వన్డే వర్షార్పణమవగా రెండో వన్డేలో అఫ్గాన్ నెగ్గడంతో వెస్టిండీస్ కథ ముగిసినైట్టెంది. వరల్డ్కప్లో ర్యాంకింగ్ల ఆధారంగా జట్లు టోర్నీకి అర్హత సాధిస్తాయన్న విషయం విదితమే. ర్యాంకింగ్స్లో టాప్-8న ఉండే జట్లు నేరుగా వరల్డ్ కప్ ఆడాల్సి ఉండగా మిగతా జట్లు క్వాలిఫికేషన్ రౌండ్ ఆడి ప్రధాన టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా క్వాలిఫికేషన్ రౌండ్ ఆడటం వెస్టిండీస్కు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.