మహబూబాబాద్ : వ్యవసాయ రంగంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తూ నూతన ఒరవడిని అనుసరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రత్యామ్నాయ, లాభసాటి పంటలను రైతులు వేసుకోవాలని కోరారు. ధాన్యంకు బదులుగా లాభసాటిగా ఉండే పామ్ ఆయిల్ పంటను సాగు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో తేమశాతం పెరిగిందని, 150 ఎకరాల్లో పామ్ ఆయిల్ ప్యాక్టరీని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
పామ్ ఆయిల్ సాగుపై ఏకరానికి బీసీలకు 80%, ఎస్సీ, ఎస్టీలకు 90% సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. వరి కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలను కల్పించాలని, కొనుగోలు కేంద్రంకు వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులు వేసేట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, డిఆర్డిఓ పిడి సన్యాసయ్య, డిపిఓ సాయి బాబా, డిఎస్ఓ నర్సింగరావు, డిఎం మహేందర్, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, డిసిఓ సయ్యద్ ఖుర్షీద్, ఆర్డిఓ రమేష్ బాబు, ఎంపీపీ అంజయ్య, జెడ్పిటిసి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
Yadadri | యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి రూ.3.10 కోట్లు విరాళం