Harish Rao | హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 17 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 547 ఎస్ఐ పోస్టులు ఉండగా, ఆ పోస్టులకు సంబంధించిన శిక్షణ నేటితో పూర్తయింది. తెలంగాణ పోలీసు అకాడమీలో ఇవాళ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన రిక్రూట్మెంట్లో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్న 547 మంది ఎస్ఐలకు శుభాకాంక్షలు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలు దాటి గౌరవ ప్రదమైన పోలీసు ఉద్యోగంలో చేరుతుండటం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు నిజమైన పండుగ రోజు. విధి నిర్వహణలో నీతి, నిజాయతీగా వ్యవహరించి, శాంతి భద్రతలు కాపాడటంలో నిర్విరామ కృషి చేయాలని కోరుతున్నాను. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని హరీశ్రావు పేర్కొన్నారు.
2022 ఏప్రిల్లో 17 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎస్సై పోస్టులు 547. గతేడాది ఆగస్టులోనే ఈ పరీక్షల తుది ఫలితాలు రాగా, అదే ఏడాది సెప్టెంబర్లో ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ మొదలైంది. ప్రస్తుతం వారు శిక్షణ ముగించుకొని విధుల్లో చేరబోతుండటంతో తెలంగాణ పోలీసు వ్యవస్థ మరింత పటిష్ఠం కానున్నది అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Encounter | జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
HMDA | హెచ్ఎండీఏ వెబ్సైట్ సర్వర్ డౌన్.. కనిపించని చెరువుల డేటా