Harish Rao | హైదరాబాద్ : నాడు ప్రజాపాలన దరఖాస్తులు కూడా నడిరోడ్లపై ఎక్కడంటే అక్కడ దర్శనమిచ్చాయి.. నేడు మళ్లీ అదే నడిరోడ్లపై కుటుంబ సర్వే పత్రాలు ప్రత్యక్షమవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.
రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం..? సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతున్నది. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి..? ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన పట్ల సీరియస్గా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు.
నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు..
నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు..
ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం.
రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం?
సామాజిక, ఆర్థిక, విద్య,… pic.twitter.com/aDHaNLBuhg
— Harish Rao Thanneeru (@BRSHarish) November 22, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి తలకాయ లేని ముఖ్యమంత్రి.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao | మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలంటున్న రైతులు : హరీశ్రావు