Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని కూడా అబద్దాల వేదికగా మార్చింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హనుమకొండలో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని హరీశ్రావు సందర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటడు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదంటడు, రుణమాఫీ చేయలేదంటడు. మేం రైతులకు ఇవన్నీ ఇవ్వకపోతే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా భట్టి విక్రమార్క అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. బీఆర్ఎస్ రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిందని అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. అసెంబ్లీలో నేను లెక్కలతో సహా అప్పజెప్పిన. బీఆర్ఎస్ చేసింది కేవలం రూ. 4 లక్షల 17 వేల కోట్లే అని, మీరు రూ. 7 లక్షల కోట్ల అప్పు అని అబద్ధాలు చెప్తే లీగల్గా చర్యలు తీసుకుంటమని చెప్పానని హరీశ్రావు పేర్కొన్నారు.
సర్వశిక్ష అభియాన్ 1523 ఉద్యోగాలు మేమే ఇచ్చినం, మీ సమస్యల పరిష్కారానికి అండగా ఉంటం. చాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఇప్పటికీ చేయలేదు ఈ ముఖ్యమంత్రి. అందుకే మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టి, ప్రజల ముందు వారి నిజస్వరూపాన్ని బయట పెట్టాలె. కేసీఆర్ చేసిన పనులన్నీ మీకు అర్ధమవుతున్నయి. అందుకే నిజం నిలకడ మీద తెలుస్తది అన్నరు. ఇవాళ ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, ప్రజా ప్రభుత్వంలో 7వ గ్యారంటీ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదా? పాలసీ మ్యాటర్ అడిగితే హౌస్ అరెస్టు, కేసులు పెడుతున్నరు అని హరీశ్రావు మండిపడ్డారు.
సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేసినవు సరే, కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమైన నీ సోదరుడు తిరుపతి రెడ్డిని కూడా అరెస్టు చేయించు. ఎందుకు అరెస్టు చేయించడం లేదు, చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? 54 మంది హాస్టల్ విద్యార్థులు మరణిస్తే.. ఇది ప్రజా పాలనా? లగచర్ల రైతులకు బేడీలు వేస్తే.. ఇది ప్రజా పాలనా? సీఎం రేవంత్ రెడ్డీ, నువ్వు మనిషివైతే, మాట మీద నిలబడితే, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించు అని హరీశ్రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | వ్యవసాయ రంగంలో కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం : ఎమ్మెల్సీ కవిత
No Detention Policy | నో డిటెన్షన్ విధానం రద్దు.. 5, 8 తరగతులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందే