వరంగల్ : పాలనా పరమైన సౌలభ్యం కోసం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్ సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ డా.గోపితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు ప్రతినెలా ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి తెలిపారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ.. అవసరమైన సాగునీరు, కరెంటు, పెట్టుబడి అందించి, గిట్టుబాటు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఇవి కూడా చదవండి..
వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షోకు విశేష స్పందన
Mahatma Gandhi University | ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా