కామారెడ్డి : పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నసరుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ వద్ద మేయిన్ రోడ్డు నుంచి హాజీపూర్ గ్రామం మధ్య ఉన్న రోడ్డును రూ. 6 కోట్లతో డబుల్ రోడ్డుగా నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా అంకోల్ గ్రామంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన కురుమ సంఘం భవనం, మత్స్య సంఘం భవనాలను ప్రారంభించారు. అంకోల్ తండాలో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి మరో 15 ఇండ్లకు భూమి పూజ చేశారు. రూ. 18 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..అన్ని వసతులతో, 100 శాతం సబ్సిడీపై దేశంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో నాకు సొత ఇల్లు లేదు అనేవారు ఉండకూడదు అన్నదే నా ఆశయం అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పక్కనున్న మహారాష్ట్రలోని పది గ్రామాల ప్రజలు తమను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుతున్నారని స్పీకర్ తెలిపారు.
పేదలు, రైతుల కష్టాలు తెలిసిన మనసున్న మహరాజు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. అందుకే రాష్ట్రంలో అనేర సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Road accident |యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి