జనగామ : రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో ఆయన ఆదివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వల్ల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఆత్మీయులు, బంధువులు ఇటీవల చనిపోవడం వల్ల హృదయం కలిచివేసిందన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని అండగా ఉంటానని భరోసానిచ్చారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికి తిరిగి ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న సర్వే సత్ఫలితాలను ఇస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో పనిచేసే ఎఎన్ఎం, ఆశా వర్కర్ల వద్ద మెడికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ములుగు, మహబూబాబాద్ లో నున్న ప్రభుత్వ దవాఖానలో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందులకు ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఇంకా మిగిలిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తిచేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
ఉపాధి కోసం వెళ్తూ..మృత్యు ఒడిలోకి
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి