హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. తాజాగా డీఎంఈ పరిధిలోని వైద్యులను కూడా కరోనా విధుల్లో నియమించింది. డీఎంఈ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులకు కొవిడ్ విధులు అప్పగించింది. అయితే గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలకు చెందిన వైద్యులను ఈ విధుల నుంచి మినహాయించింది. అదేవిధంగా మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన సిబ్బంది, సీనియర్ రెసిడెంట్లు కూడా కరోనా విధుల్లో భాగస్వాములు కావాలని ఆదేశాలు జారీచేసింది. మెడికల్ కాలేజీల్లోని పీజీలు, ఇంటర్న్షిప్లు చేస్తున్నవారు కూడా పాలుపంచుకోవాలని సూచించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..