నిజామాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ వరద బాధితులకు తన ఆపన్న హస్తాన్ని అందించారు. గంగస్థాన్ ఫేస్- 2 పరిధిలోని వాగు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వరద బాధితుల ఆకలిని ఎమ్మెల్సీ కవిత తీర్చారు. గురువారం 150 మంది బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఎమ్మెల్సీ కవిత సహకారంతో ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జెడ్పీ చైర్మన్ విఠల్ రావ్ సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ నీతూ ప్రసాద్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావ్ , తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, నుడా డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, జలపతి రావు, అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు
Nizamabad : పైకి తేలిన అంతరాష్ట్ర రహదారి
నేషనల్ హైవేపై దిగిన సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలు.. వీడియో