నిజామాబాద్ : రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల రోడ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కాగా, జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ప్రవాహం లో మునిగి పోయిన అంతరాష్ట్ర రహదారి గురువారం ఉదయం కాసింత పైకి తేలింది.
నిన్న అంతర్రాష్ట్ర వంతెన మీదుగా గోదావరి ప్రవాహం ఉగ్రరూపాన్ని దాల్చింది.
కందకుర్తి గ్రామం చుట్టూతా జలమయమైన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు రెండు రోజులుగా వానలు లేకపోవడం మూలంగా వరద కొద్దిగా తగ్గుముఖం పట్టినా ప్రవాహ వేగం మాత్రం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది.