నిజామాబాద్ : మత్య్సకారులు ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం బాల్కొండ మండలం నాగపూర్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో చేప పిల్లలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లోని మత్య్సకారుల కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడాలి.
దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేపట్టి ఆర్థిక ప్రయోజనం కలగాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై ఆధారపడిన బెస్త, గూండ్ల కులస్తులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు.
ఇప్పుడు ఊరూరా చేపలు దొరుకుతున్నాయి. మత్య్సకారుల కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్నాయి. ఊర్లలో మంచి చేపలను ఆహారంగా అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఆంధ్ర నుంచి చేపలు దిగుమతి అయ్యేవి. కానీ నేడు సీఎం కేసీఆర్ తీసుకున్న కార్యక్రమం వల్ల చేప పిల్లల పంపిణీతో ఇక్కడే విరివిగా చేపలు దొరుకుతున్నాయని తెలిపారు.
జిల్లాలో 896 చెరువులు, అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మొత్తంగా 4కోట్ల 30 లక్షల చేపపిల్లను వదిలినట్లు వివరాలను వెల్లడించారు. అలాగే ప్రభుత్వం ద్వారా మత్స్య కారులకు వలలు, మోపెడ్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Srsp Project : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద