న్యూఢిల్లీ : రెండు రోజుల పాటు పార్లమెంట్ కమిటీతో సమావేశం కావడానికి అకస్మాత్తుగా తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డీజీపీతో పాటు ఏజీజీ జితేందర్, ఏడీజీ సంజయ్ జైన్ కూడా వెళ్లారు. పార్లమెంట్ కమిటీ ముందు తెలంగాణ పోలీస్ శాఖ పని తీరును వివరించారు. అందులో పోలీస్ శాఖ ప్రవేశ పెడుతున్న సంస్కరణలు, అమలు చేస్తున్న విధానాలు, టెక్నాలజీ, మావోయిస్టు సమస్య, వర్టికల్ (పని విభజన) పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డీజీపీ వివరించారు. ఈ క్రమంలో అన్ని అంశాలపై నివేదికను పార్లమెంట్ కమిటీకి సమర్పించారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ