సూర్యాపేట, (నమస్తే తెలంగాణ): అభివృద్ధిలో ఆధ్యాత్మికత ఒక భాగమేనని తద్వారా ప్రజల్లో అభివృద్ధి చేసే వారిపై విశ్వాసం పెంపొందుతుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. అలాగే భక్తిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన పాలకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఆయన అడుగు జాడ ల్లోనే మంత్రి జగదీశ్రెడ్డి పయనిస్తున్నాడని అని కొనియాడారు. కేసీఆర్ యాదాద్రి దేవాలయ పునరుద్దరణ చేపడుతుండగా మంత్రి జగదీష్రెడ్డి సూర్యాపేట పట్ణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం జీర్ణోద్దరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు.
మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి జీయర్స్వామి సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సభలో జీయర్ స్వామి మాట్లాడుతూ అభివృద్దిలో ఆద్యాత్మిక ఒక భాగమేనని అంటువంటి ఆధ్యాత్మికతను భాగస్వామ్యం చేసినందునే తెలంగాణ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకు పోతున్న నేత మంత్రి జగదీశ్రెడ్డి అంటూ ఆయన కితాబిచ్చారు. అటువంటి వ్యక్తి పాలకుడు కావడం జిల్లా ప్రజల అదృష్టంగా ఆయన అభివర్నించారు. ఆయన రాకతో ఈ ప్రాంతంలో రూపురేఖలు మారిపోయాయన్నారు.
మెడికల్ కళాశాల అందులో అంతర్భాగమని అదే స్ఫూర్తిని జిల్లా మొత్తం విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. సమాజాభివృద్ధిలో భగవత్ భక్తి అవశ్యం ఎంతై నా ఉందన్నారు. అటువంటి భక్తి ఉన్న సమాజం అభివృద్ధిలో అగ్రభాగాన ఉంటుందన్నారు. శ్రీశ్రీశ్రీ రామంజులస్వామి వారి కృపతో వెయ్యి సంవత్సరాల క్రితం అటువంటి భక్తికి బీజం పడిందన్నారు. ఆ బీజం వటవృక్షాలుగా మారి విస్తరించడంతో 700 ఏండ్లు సవ్యంగా సాగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తరువాత కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో పాశ్చ్యాత్తుల పాలన రావడంతో గడచిన 300 ఏండ్లుగా వ్యవస్థ చిన్నాభిన్నంగా మారిందన్నారు.
రామానుజుల వారి స్ఫూర్తి ఇప్పటికీ ఉత్తర భారత దేశంలోని రాజస్తాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలలో ఇప్పటికీ కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. అదే శోభ నేడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నదన్నారు. అందుకు ముక్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవనే కారణన్నారు. అధికారికంగా ముందెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని కేసీఆర్ చేశారని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధిలో దేశాన్ని ఒక భాగంగా మలిచిన ఘనత కడా ఆయనదే అన్నారు. అదే స్ఫూర్తిని మందుకు తీసుకుపోతున్న నేత మంత్రి జగదీష్రెడ్డి అని ఆయన మీద ప్రశంసలు కురిపించారు. అటువంగటి నేత ఇక్కడ పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని ఆయన అభివర్ణించారు. ఆయన రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారాయని ఆయన కొనియాడారు.
అటువంటి వ్యక్తి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్దరణకు పూనుకోవడం అభినందనీయమన్నారు ఆ భారాన్ని మీద వేసుకకొని ముందుకు సాగుతున్న మంత్రి జగదీశ్రెడ్డికి భక్తులు తోడ్పాటునందించాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలో ఆద్యాత్మిక శోభను విరజిమ్మే ఈ ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం కావాలని ఆయన మంగళాశాసనాలు అందించారు. ఆలయ జీర్నోద్దరణ శంఖుస్థాపనతో వికాస తరంగిణి కార్యకర్తలకు బాధ్యత పెరిగిందన్నారు. అదే విధంగా వ్యక్తుల మద్య తారతమ్య బేదాలను రూపుమాపే శక్తి ఒక్క ఆధ్యాత్మికతకే ఉందన్నారు. అందుకు సూర్యాపేట జిల్లా కేంద్రమే చక్కటి నిదర్శనమన్నారు.
ప్రత్యర్థులుగా ఉన్న దివంగత మీలా సత్యనారాయణ, మొరిశెట్టి సత్యనారాయణలు ఇదే దేవాలయం సాక్షిగా కార్యక్రమాలతో పోటీపడి పాల్గొనడాన్ని ఆయన గుర్తు చేశారు. యజ్ఞ యాగాదులతో పర్యావరణ పరిరక్షణ సులభతరమౌంతుదన్నారు. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వంటి సమస్యలు కూడా హోమంతో మాయమవుతాయన్నారు. శాస్త్రీయంగా ఇది రుజువు అయిందన్నారు.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రాంతంలో అందరూ చనిపోతే ఒక ఇంట్లో నలుగురు ప్రాణాపాయం లేకుండా బయట పడ్డారని అందుకు కారణం ఆ ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యితో రెండు పూటలా హోమం చేయడమే అన్నారు ఇది నేను చెప్పింది కాదు అని దుర్గటన జరిగినప్పుడు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిందని జీయర్ స్వామి ఉటంకించారు. లోక హితం 1035 కుండలలో పెద్ద ఎత్తున యజ్ఞాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు అవసరమైన నెయ్యిని రాజస్థాన్, గుజరాత్ల నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
సభ నిర్వాహకుడు మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడంతో పాటు పట్టనం విస్తరించి ఉండడంతో దేవాలయన్ని విస్తరించాలని మూడు సంవత్సరాల క్రితమే నిర్నయించామన్నారు. అశేష సంఖ్యలో భక్తుల భక్తిని పొందుతున్న ఆలయంలో పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించామని ఆయన వెల్లడించారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలి అన్నదే సంకల్పమన్నారు. అటువంటి జీర్ణోద్దరణ పనుల శంఖుస్థాపనకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరు కావడం హర్షణీయం అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యడు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ్కృష్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.