Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut ) పై సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ ( CPI Narayana ) మండిపడ్డారు. భారతదేశానికి 2014లో స్వాతంత్ర్యం వచ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం అని కంగనా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ స్థాయి న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కంగనా వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీతో పాటు పలువురు నాయకులు తప్పుబట్టారు. నెటిజన్లు కూడా ఆమెపై ఫైర్ అవుతున్నారు.
సీపీఐ నారాయణ వ్యాఖ్యలు.. ఆయన మాటల్లోనే.. ‘విలాసవంతమైన యాచకురాలు ఎవరైనా ఉన్నారంటే ఇటీవల పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనా రనౌత్. ఆమె సినిమా యాక్టర్. కళాకారిణి. కళామాతల్లికి సేవ చేస్తోంది సంతోషమే. పద్మశ్రీ అవార్డు ఇచ్చారు.. ఎందుకు ఇచ్చారు అర్థమైంది. స్వాతంత్ర్య పోరాటం గురించి ఆమెకూ తెలియదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లకు అసలు తెలియదు. వాళ్ల చేత పద్మశ్రీ అవార్డు పొందినటువంటి కంగనా రనౌత్.. 1947లో స్వాతంత్ర్యం భిక్ష అని, అసలు స్వాతంత్ర్యం కాదు అని, బీజేపీ వచ్చిన తర్వాత 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పడమంటే ఇంత కన్నా బానిసత్వం ఉండదు. నువ్వు అడుక్కుతింటున్నావ్.. అడుక్కో.. యాచకురాలిగా అడుక్కో.. నాకేం అభ్యంతరం లేదు. నీకు భిక్ష ఆర్ఎస్ఎస్ పెడితే.. దాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోలుస్తావా? స్వాతంత్ర్య పోరాటం గురించి మాట్లాడే అర్హత నీకు, నీకు పద్మశ్రీ ఇచ్చిన ఆ ప్రభుత్వానికి కూడా అర్హత లేదు. కంగనా రనౌత్ విలాసవంతమైన బిచ్చగత్తె. కుష్ఠురోగులను మించిన రోగిష్టి కంగనా రనౌత్. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజానికి ఆమె క్షమాపణ చెప్పాలి. లేకపోతే నిరసనలు వ్యక్తం చేయడం ఖాయం’ అని సీపీఐ నారాయణ అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్
Kangana Ranaut: పెళ్లిపై స్పందించిన కంగనా.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటూ కామెంట్
కంగనా పరువాల విందు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. కంగనా రనౌత్ ఆవేదన
ఇక్కడా వారం రోజులు ఉండనిచ్చేలా లేరు.. ఇన్స్టాగ్రామ్పై కంగనా