హైదరాబాద్ : ఎస్సీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం సోమవారం మాసబ్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. ఎస్సీల సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎస్సీ సంక్షేమం, వికాసానికి ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. నోడల్ ఏజెన్సీలో భాగంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు సేవాభావంతో ముందుకు సాగాలని అన్నారు. ఉన్నతాధికారులు రాహూల్ బొజ్జ, విజయ్ కుమార్, యోగితారాణా, వాకాటి కరుణ, శ్రీదేవి, సయ్యద్ ఒమర్ జలీల్, కరుణాకర్, హన్మంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.