కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పేదలకు అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు వచ్చాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా దవాఖాన ఆవరణలో 38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్ ను కలెక్టర్ రాహుల్ రాజ్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప లతో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. అత్యాధునిక హంగులతో పేదలకు ఉచితంగా 57 రకాల పరీక్షలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుందన్నారు.
పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కుమ్ర౦ బాలు, ఆసిఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్, డిప్యూటీ జిల్లా వైద్యాధికారులు సునీల్ రావు, సుధాకర్ నాయక్, దవాఖాన సూపరింటెండెంట్ స్వామి, టీఆర్ఎస్ నాయకుడు బాలేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి