వికారాబాద్ : పరిగి పట్టణాభివృద్ధికి అందరు సహకరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కోరారు. సోమవారం పట్టణంలోని 3వ వార్డులో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని మంజూరు చేయించిన రూ.15కోట్లలో రూ.10కోట్ల విలువ చేసే పనులు కొనసాగుతున్నాయని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే ఆదేశించారు.
తహసీల్దార్ కార్యాలయం రోడ్డు బీటీ పనులు ఈనెల మూడో వారం లోపు పూర్తి చేయాలన్నారు. వర్షాలు కురిస్తే బీటీ వేసినా ఉపయోగం ఉండదని, అందువల్ల ముందుగానే రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
జెడ్పీహెచ్ఎస్ నెం.1 నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు సీసీ వేయాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. డివైడర్ పనులలో వేగం పెంచాలన్నారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కౌన్సిలర్ వేముల కిరణ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, మౌలానా, సాదక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం