వనపర్తి : ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ముందుకు సాగాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతుల కల్పన జరగాలన్నది సీఎం కేసీఅర్ ఆకాంక్ష అని తెలిపారు.
వనపర్తి నడిబొడ్డున రూ.19.50 కోట్లతో సమీకృత మార్కెట్ రెండంతస్తులతో 85 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తామన్నారు.70 వ్యాపార దుకాణాలు, 120 కూరగాయల దుకాణాలు, సూపర్ మార్కెట్ , చిల్డ్రన్ పార్క్ , 28 నాన్ వెజ్ దుకాణాలు, పండ్ల దుకాణాలు ఇందులో ఉంటాయి.
ఎకో పార్క్ సమీపంలో రూ.3 కోట్లతో వే సైడ్ మార్కెట్, రూ.కోటి 40 లక్షలతో పాత బస్టాండ్ లో మరో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతామన్నారు. వనపర్తి జనాభా భవిష్యత్ లో 3, 4 లక్షలకు చేరుకున్నా ఇబ్బంది లేకుండా పనులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నాగవరం సమీపంలో మరో మార్కెట్ నిర్మాణం చేస్తాం.
ఎక్కడి ప్రజలకు అక్కడ అన్నీ అందుబాటులో ఉండాలన్నదే మా అలోచన అన్నారు. ఇంకా పలు అభివృద్ధి పనులు త్వరలో చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
లింగోజిగూడ డివిజన్లో బీజేపీకి షాక్
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం