సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటే వారి పాలిట మృత్యు పాశమైంది. చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..నిజాంపేట్కు చెందిన బాజా సాయిలు, ముద్దెల్లి సంగమేశ్ స్థానిక ఊర చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.