R Krishnaiah | హైదరాబాద్ : నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో భేటీ అనంతరం బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించడం నా జీవిత లక్ష్యం అని కృష్ణయ్య స్పష్టం చేశారు. రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని ప్రతి ఒక్క బీసీ బిడ్డ కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని ఆర్ కృష్ణయ్య నివాసానికి ఈ ఉదయం ఎంపీ మల్లు రవి వెళ్లారు. ఆర్ కృష్ణయ్యతో దాదాపు అర గంటకు పైగా మల్లు రవి చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కృష్ణయ్యను మల్లు రవి ఆహ్వానించినట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా చేయబోతున్నాం. బీసీ ఉద్యమం బలోపేతం కోసం రాజ్యసభ పదవికి రాజీనామా చేశాను. ఈ ఉద్యమం ద్వారా దేశ వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగేలా పోరాడుతాను. వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వర్గాలకు న్యాయం చేయడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏండ్లు గడుస్తున్నప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని బీసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ నన్ను రాజ్యసభకు పంపించారు. బీసీల తరుపున చట్ట సభల్లో ప్రశ్నించిన సమాధానం రాలేదు. ఇంకా తన పదవీకాలం నాలుగేండ్లు ఉంది. కానీ బీసీ ఉద్యమం కోసం రాజీనామా చేశాను. రాజ్యాధికారంలో వాటా.. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు బీసీలకు ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి. బీసీల కోసం చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. గ్రామ, మండల,జిల్లా కమిటీలు వేయాలని బీసీలను కోరుతున్నానని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం.. రేవంత్పై కేటీఆర్ ఫైర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు.. కేటీఆర్ ఎద్దేవా
KTR | ఓట్లేయలేదనే కూల్చివేతలు.. బీఆర్ఎస్ కన్స్ట్రక్షన్ చేస్తే రేవంత్రెడ్డిది డిస్ట్రక్షన్