హత్నూర/ మెదక్ : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ప్రాజెక్టులు, కాలువ నిర్మాణం పనులు చేపడుతుందని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. సోమవారం హత్నూర మండలం లింగాపూర్,చిక్ మద్దూర్ గ్రామ శివారులోని మంజీర నదిపై నిర్మించనున్న చెక్ డ్యామ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కాలువల నిర్మాణం పనుల్లో వేగంపెంచి చురుకుగా పనులయ్యేవిదంగా చర్యలు తీసుకుంటుందన్నారు. నేడు ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో లక్షల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం అవుతున్నాయని తెలిపారు.
కాగా, హత్నూర మండలంలో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులు పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి అడుగంటిన బోరు బావులు నీరు పుష్కలంగా లభిస్తుంది అన్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతంలోని వ్యవసాయ భూములన్నీ పంట పొలాలుగా మారి రైతులు ఆర్థికాభివృద్ధిని సాధించే అవకాశం ఉందన్నారు.
లింగాపూర్ గ్రామాభివృద్ధికి కృషిచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్లు దుర్గారెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి