నమస్తే తెలంగాణ, ఆగస్టు 14 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా శనివారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హనుమకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్లో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగామలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్, భూపాలపల్లిలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
అనంతరం ఆయా జిల్లాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక చదివి వినిపిస్తారు. స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించనున్నారు. పాఠళాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఉత్తమ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను కలెక్టర్లు పరిశీలించారు.