సూర్యాపేట : అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలుస్తున్నాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. సీఎం సహాయ నిధి పేద ప్రజల కండ్లలో వెలుగులు నింపుతుంన్నారు.
మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని ప్రశంసించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడ బిడ్డలకు వరంగా మారాయన్నారు. కార్యక్రమంలో కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి