సూర్యాపేట : కరోనాపై చేసే పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరి దాతృత్వం వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కోవడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, వ్యక్తిగతంగా కొందరు ఇతోధికంగా సహాయపడడానికి ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు.
కరోనా రెండో దశ ఉదృతం అవుతున్న వేళ అక్షిజన్ ను అందుబాటులో ఉంచడానికి జిల్లాకు చెందిన ఎన్నారై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట మెడికల్ కళాశాలకు 10 అక్షిజన్ కాన్ సెంట్రేటర్స్ ను బహుకరించారు. వాటిని శనివారం మెడికల్ కళాశాల ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా మాడారు.
ముందు చూపుతో సీఎం కేసీఆర్ సూర్యాపేట, నల్లగొండలలో నెలకొల్పిన మెడికల్ కళాశాలలే లేకుండా కరోనా పేషెంట్ల ప్రాణం నిలుపుతున్నాయన్నారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్య సర్వే జరుగుతుందని, కరోనా సోకిందని గుర్తిస్తే అక్కడికక్కడే కిట్లు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.
అన్నింటికి మించి మానసిక ధైర్యమే కరోనాకు మందు అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, సూపరింటెండెంట్ దండా మురళీధర్ రెడ్డి, ఆర్ఎంవో కళావతి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి