హైదరాబాద్ : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం పెంచుకునే మార్గం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం తొలిసారి సమావేశమైంది. ఇందులో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, సత్య వతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. గృహనిర్మాణ సంస్థ పరిధిలోని భూములు, ఇళ్ల విక్రయాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. నిధుల సమీకరణపై సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
అదేవిధంగా సమావేశం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, సౌకర్యాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. త్వరలో మంత్రివర్గ ఉప సంఘం ఇతర దేశాలు, రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్య సేవలు, వైద్య సేవల మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయనున్న నేపథ్యంలో దీనిపై కూడా మంత్రులు చర్చిస్తున్నారు.