Yamunotri Dham |ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గంగోత్రి, యమునోత్రి ఆలయాల (Yamunotri Dham) తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. అక్షత తృతీయ (Akshaya Tritiya) పర్వదినం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఈ రెండు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో యమునోత్రి, గంగోత్రి ఆలయాలు కూడా భాగం. చార్ధామ్ యాత్ర (Char Dham Yatra) లో ఈ ఆలయాల సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శిస్తుంటారు. అయితే, శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఆలయ ద్వారాలను.. ఇవాళ తెరిచారు. మరోవైపు కేదార్ నాథ్ ఆలయం తలుపులు కూడా ఇవాళ తెరుచుకున్న విషయం తెలిసిందే. చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం ఈ నెల 12న తెరుచుకోనున్నాయి.
#WATCH | On the occasion of Akshaya Tritiya, the doors of Yamunotri Dham were opened for devotees amidst proper rituals and chanting of mantras.
(Source – Yamunotri Dham Mandir trust) pic.twitter.com/Vn5GrUYluV
— ANI (@ANI) May 10, 2024
#WATCH | On the occasion of Akshaya Tritiya, the doors of Gangotri Dham have been opened for devotees amidst full rituals and Vedic chanting.
(Source – Gangotri Dham Mandir trust) pic.twitter.com/FHr2p4Q1rs
— ANI (@ANI) May 10, 2024
Also Read..
Kedarnath | తెరుచుకునున్న కేదార్నాథ్ ఆలయం.. తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం
Akshaya Tritiya | నేడు అక్షయ తృతీయ.. దేశ ప్రజలకు మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు
Narendra Dabholkar | నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష