TS Assembly Elections | రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) వికాస్ రాజ్ తెలిపారు. అక్కడక్కడా చెదురుమదురు ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు అదుపు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) పోలింగ్ సరళిపై హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తడంతో.. కొత్తవి మార్చాం.రూరల్ ఏరియాస్లో పోలింగ్ శాతం బాగుంది. అయితే, అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాగా వస్తున్నారు. ఓటరు కార్డే కాకుండా ఆధార్, పాన్ తదితర 12 గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నాం. మధ్యాహ్నం నుంచి పోలింగ్ వేగం పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
Also Read..
Cm KCR | చింతమడకలో ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
TS Assembly Elections | సతీసమేతంగా సిద్దిపేటలో ఓటేసిన మంత్రి హరీశ్రావు
TS Assembly Elections | నర్సాపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత