యాదాద్రి, మార్చి 30: సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఆలయం లో విధులు నిర్వర్తించే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి కరో నా సోకడంతో స్వామి వారికి జరిపే నిత్య కైంకర్యాలను ఆం తరంగికంగా చేపట్టారు. స్వామి వారి నిత్య పూజల్లో భక్తుల కు అనుమతిని ఇవ్వలేదు. తాజాగా ఆలయంలో మరికొం త మందికి కరోనా వైరస్ ప్రబలడంతో భక్తులచే చేపట్టే ఆర్జి త సేవలను మరికొన్ని రోజులు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత ప్రకటించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు స్వామి వారి సేవల్లో భక్తులకు అనుమతి లేదని, ఆర్జిత సేవలతో పాటు, భక్తులకు జరిపించు నిత్యన్నదానం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. స్వామివారి నిత్యపూజలను ఆంతరంగికంగా ని ర్వహించి, భక్తులకు స్వామివారి లఘుదర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్వామివారి బాలాలయం, క్యూలైన్లలో ఆలయ సిబ్బంది సోడియం హైఫోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేపట్టారు.
నిరాడంబరంగా స్వామివారి నిత్యసేవలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకు లు నిరాడంబరంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మం గళవారం ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుద ర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకు మార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూ ర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనా రాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహి క వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. క్షేత్ర పాలకుడు ఆంజనే యస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. క్షేత్రానికి చెంత ఉన్న గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలం కరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. లలితాపారాయణం చేశారు. స్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లు నైవేధ్యంగా సమర్పించారు.
ఖజానాకు రూ. 2,97,813 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 2, 97,813 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.14,600, రూ. 100 దర్శనా లతో రూ. 14,500, ప్రచారశాఖ ద్వారా రూ.1,500, వ్ర తాలతో రూ.7,000, కల్యాణకట్టతో రూ.7,220, ప్రసాద విక్రయాలతో రూ.1,35,485, శాశ్వత పూజలతో రూ.10, 116, వాహన పూజలతో రూ.2,200, టోల్గేట్ ద్వారా రూ.550, అన్నదాన విరాళంతో రూ. 2,732, యాదరుషి నిలయంతో రూ. 20,300, పాత గుట్టతో రూ.500, ఇత ర విభాగాలతో రూ. 81,110తో కలిపి రూ. 2,97,813 ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.
యాదాద్రిలో 83 కు చేరిన కరోనా బాధితులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండకింద తులసి కాటే జీ వద్ద యాదగిరిగుట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యం లో కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. మంగళవారం 268 మందికి పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారించినట్లు ఇందులో 10 మంది ఆలయ సిబ్బంది ఉన్నారని మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపా రు. గతంలో ఆలయంలో 73మంది సిబ్బందికి రాగా తాజాగా మరో 10 మందితో కలిపి ఇప్పటివరకు యాదాద్రి ఆలయంలో కరోనా బాధితుల సంఖ్య 83కు చేరింది.
యాదగిరిగుట్టలోస్వచ్ఛందంగా లాక్డౌన్
సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక వ్యాపారస్తులు, దుకాణదారులు స్వ చ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. మంగళవారం తమ తమ షాపులను మూసివేసి కరోనాపై యుద్ధం ప్రకటించా రు. కొద్ది రోజులుగా యాదగిరిగుట్ట పట్టణంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో యాదగిరి గుట్టకు చెందిన వ్యాపారస్తులు బంద్ను పాటించాలని ఏక గ్రీవంగా తీర్మానించగా మొదటి రోజు బంద్ ప్రశాంతంగా ముగిసింది. నేడు సైతం షాపులను బంద్ నిర్వహించి స్వ చ్ఛందంగా లాక్డౌన్ పాటించనున్నారు.
ఇవీ కూడా చదవండి..
నిమ్స్లో డయాలిసిస్ మెరుగుకు నిధులు