సూర్యాపేట: తెలంగాణ సమజాన్ని తట్టి లేపడంతో పాటు ప్రశ్నించడం అనే విషయాన్ని ఇక్కడి ప్రజలకు నేర్పిన ఘనత వీర వనిత చాకలి ఐలమ్మదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా సూర్యాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని ఐలమ్మ కు నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. అంతటి ధీరురాలి చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఐలమ్మ జయంతి, వర్ధoతి కార్యక్రమాలను ప్రభుత్వం అద్వర్యంలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని కొనియాడారు.
సమాజ అభివృద్ధి కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ముఖ్యమంత్రితీసుకున్న నిర్ణయంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది ఐలమ్మ అని కీర్తించారు.
ఆమె సాహసం అసమానమని, అందరికీ ఆదర్శప్రాయమని ప్రశంసించారు. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ఆమె జీవితం ప్రతీక అని అన్నారు. మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైందని చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, టి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు రాజేష్, భరత్, టి.ఆర్.ఎస్ నాయకులు చిన శ్రీరాములు, రామగిరి నగేష్, జంపాల శ్రీను, కీసర వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి అనీల్, బాల్క వెంకట్, లింగంపల్లి శ్రీనివాస్, రేపాల పాండు, గుండపనేని కిరణ్, బత్తుల ప్రసాద్, శరణ్, రఫీ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షోకు విశేష స్పందన
Mahatma Gandhi University | ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా