సైదాపూర్, ఏప్రిల్ 20: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో కొంటున్నదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి సూచించారు. వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్విండో ఆధ్వర్యంలో మండలంలోని దుద్దనపల్లి, జాగీర్పల్లి, రాంచంద్రాపూర్, ఎలబోతారం, రాములపల్లి, ఎల్లంపల్లి, గుజ్జులపల్లి, గొడిశాల, బొమ్మకల్, గుండ్లపల్లి గ్రామాల్లో మంగళవారం వరిధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరిధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో వైస్ చైర్మన్ కలకోటి కిషన్రావు, హుజూరాబాద్ ఏఎంసీ డైరెక్టర్ సోమారపు రాజయ్య, సర్పంచులు తాటిపల్లి యుగేంధర్రెడ్డి, గాజర్ల సదానందం, వీరమల్ల రవీందర్రెడ్డి, తొంట కాంతమ్మ, రేగుల సుమలతాఅశోక్, మ్యాకల శిరీషాముకుందరెడ్డి, కందుల విజయానారాయణరెడ్డి, గుండేటి సునీతారాణీజయకృష్ణ, లతాకుమారస్వామి, ఎంపీటీసీలు గాజర్ల భాగ్యాఓదెలు, చాడ చైతన్యాకొండల్రెడ్డి, లంకదాసరి అరుణామల్లయ్య, దిశ కమిటీ సభ్యురాలు ఓరుగంటి దేవేంద్ర, సింగిల్విండో డైరెక్టర్ల ఫోరం అధ్యక్షుడు బొమ్మగాని రాజు, ప్రధాన కార్యదర్శి చాడ ప్రకాశ్రెడ్డి, డైరెక్టర్లు ఏలూరి నర్సిరెడ్డి, పల్లేని ప్రవీణ్రావు, ఏలూరి తిరుపతిరెడ్డి, నమిండ్ల జమున, నాయకులు కామిని వీరేశం, మునిగంటి స్వామి, ఎల్కపల్లి రవీందర్, సీఈవో చెన్నవేణి శ్రీధర్, అసిస్టెంటు సీఈవో ఈరాల భిక్షపతి, అకౌంటెంట్ ఎలబోయిన మహేశ్, కంప్యూటర్ ఆపరేటర్ కామారపు శ్రీకాంత్, సిబ్బంది బావండ్ల కేశవులు తదితరులు పాల్గొన్నారు.