KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు నందినగర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడనున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తనపై నమోదైన ఏసీబీ కేసులను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో కేటీఆర్ న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ వేశారు.
ఏసీబీ తనపై తప్పుడు కేసు పెట్టిందని.. దాన్ని క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును కోరగా.. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ మంగళవారం తీర్పును వెల్లడించింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించింది. ఈ క్రమంలో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుపై ఇప్పటికే లీగల్ టీమ్తో చర్చలు జరిపారు. మరో వైపు ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్లో కోరింది.
ఇవి కూడా చదవండి..
Bajireddy Govardhan | పగలు కాంగ్రెస్తో.. రాత్రి బీజేపీతో రేవంత్ అనుబంధం : బాజిరెడ్డి గోవర్ధన్