KTR | హైదరాబాద్ : ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అధికార పక్షానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేశారు. శాసనసభలో రైతుభరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలు తెచ్చుకోండి అని ఇదే రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం పెడుతా అన్నారు. ఏకకాలంలో ఒకటే పెన్ స్ట్రోక్తో రుణమాఫీ చేస్తా అన్నారు. డిసెంబర్ 7న స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్లో రుణమాఫీ కోసం రూ. 49 వేల 500 కోట్లు అని చెప్పారు. ఎక్కడో సీఎం మాట్లాడుతూ.. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేసేస్తాం. రూ. 40 వేల కోట్లు కట్టేస్తాం అన్నారు. సీఎం రూ. 40 వేల కోట్లు అంటే.. కేబినెట్కు వచ్చే వరకు రూ. 31 వేల కోట్లు, బడ్జెట్కు వచ్చేసరికి రూ. 26 వేల కోట్లు అయింది. మొన్న జరిగిన పాలమూరు విజయోత్సవ సభలో రూ. 19 వేల కోట్లు అని సీఎం చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం.. ఈ రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం.. కొండారెడ్డిపల్లే, సిరిసిల్ల, పాలేరు పోదాం.. వాళ్ల ఇష్టం. ఏ ఒక్క ఊరిలో నైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని చెబితే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఈ రకమైన బుకాయింపు, మోసం ప్రభుత్వానికి మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ మండిపడ్డారు.
రైతుబంధు ఎందుకు ఆగిపోతది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పథకం ఆపేందుకు హౌలాగాళ్లమా అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి వానకాలం రైతుబంధు ఎందుకు ఎగ్గొట్టారు. ముఖ్యమంత్రి మాటల్లో ఇప్పుడు వారిని ఏమనాలి..? ఒక పంట కాదు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మేం కూడా మూడు పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. కౌలు రైతుకు, భూ యజమానికి రైతుబందు ఇస్తామన్నారు. తప్పకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మొదటి వంద రోజుల్లోనే రైతుభరోసా ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు. అప్పుడేమో అందరికి అని ఇప్పుడేమో కొందరికి అని కోతలు పెట్టారు. రైతుభరోసారకు బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు కేటాయించారు. 70 లక్షల మంది రైతన్నలకు రూ. 23 వేల కోట్లు కావాలి. రైతుబంధు కోతలకు సిద్దపడ్డ తర్వాతనే కేబినెట్ సబ్ కమిటీ వేశారు. మంత్రివర్గ ఉపసంఘం వేసి టైం పాస్ చేస్తున్నారు. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టినట్టే.. ఇప్పుడు కూడా రైతుబంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేనిఫెస్టోలో కోతల గురించి ఎందుకు చెప్పలేదు. ఈ రాష్ట్రంలో కోటి పైచిలుకు పాన్ కార్డులు ఉన్నాయి. వీళ్లకు కట్ చేస్తామంటే ఎలా..? ఐటీ కట్టే వాళ్లకు కట్ చేస్తామంటే ఎలా..? రైతుబంధు పథకానికి ఉరి వేయబోతున్నారని మా అనుమానం అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ సవాల్
కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా..
ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా – కేటీఆర్ pic.twitter.com/S15zM0EJ3N
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఇదేనా రేవంత్… నువ్వు తీసుకొచ్చిన మార్పు? సీఎంను సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
KTR | రైతుబంధు యధాతథంగా ఇస్తామంటే.. ఈ చర్చ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్