KTR | హైదరాబాద్ : గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును దగ్గర నుంచి గమనిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిన్న, ఇవాళ్టి గ్రామసభలను చూస్తే కాంగ్రెస్ ప్రజాపాలన తీరు ఏమిటో తెలిసిపోతోందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో సత్తుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని గ్యారంటీలపై నిలదీస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గ్రామ సభలకు వేసిన టెంట్లను కూడా ప్రజలు కోపంతో పీకేస్తున్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఓడిపోవడంతో ఆ నియోజకవర్గ ప్రజలు ప్రజలు ఎంతో కోల్పోయారు. గ్రామాలు, పట్టణాల్లో కేసీఆర్ హాయంలో జరిగినన్నీ పనులు గతంలో ఎప్పుడూ జరగలేదు. మున్సిపాలిటీకి రూ. 50 లక్షలు కేటాయిస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది.. కేసీఆర్ హయంలో ఆ పరిస్థితి మారి పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
భవిష్యత్ మనదే. అన్ని వర్గాలలో ఈ ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. సత్తుపల్లిలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. మళ్ళీ కేసీఆర్ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం. ఉమ్మడి ఖమ్మంలో మళ్ళీ బీఆర్ఎస్ విజయకేతనం ఎగురేస్తుంది. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు 23 మంది బీఆర్ఎస్ నుంచి గెలిస్తే 17 మంది ఇంకా పార్టీలోనే కొనసాగుతుండటం పార్టీ పట్ల వారికున్న విధేయతకు నిదర్శనం. రైతుల సమస్యలపై అధ్యయన కమిటీ వేశాము. రానున్న రోజుల్లో ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడుదాం. త్వరలోనే సత్తుపల్లి నేతలతో కేసీఆర్ సమావేశమవుతారని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి.. సీఎంకు హరీశ్ రావు సవాల్
Danam Nagender | చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్ చల్