KTR | జాతి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తాయని 2004-14 మధ్య యూపీఏ ప్రభుత్వ సారధి, ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ మీద టీవీ9 చర్చా వేదిక, గన్ పార్క్, బహిరంగ వేదికపై ఎప్పుడంటే అప్పుడు చర్చకు రెడీ.. రెండు పార్టీలు మా పార్టీ మీద. నా మీద చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బహిరంగంగా లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం` అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏ ట్యాపింగ్ చేయలేదని, ఏ ఫోన్ ట్యాపింగ్ లోనూ నా ప్రమేయం లేదు అని నేను లై డిటెక్టర్ పరీక్షకు కూర్చున్నప్పుడు చెబుతా.. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చర్చకు సిద్ధం. మరి సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షకు కూర్చునే ధైర్యం ఉందా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పాలి. వారు కూడా నీతులు చెబుతున్నారు. పెగాసెస్ అనే సాఫ్ట్ వేర్ సాయంతో కేంద్ర ప్రభుత్వం విపక్షాలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేయలేదా? ఆ విషయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పగలరా.. నేను ఏ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పగలను.. నాకు ఆ విశ్వాసం ఉంది. కడిగిన ముత్యంలా బయటకు వస్తా.. వారు లైడిటెక్టర్ పరీక్షకు కూర్చోగలరా..?’ అని కేటీఆర్ సవాల్ చేశారు.
Read More: KTR | పిచ్చి వాగుడు వాగితే సీఎం రేవంత్ రెడ్డికి పరువు నష్టం నోటీసు పంపుతా : కేటీఆర్