KTR | 2014 నుంచి పదేండ్లు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు రుణ పడి ఉంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పార్టీ పాత్రలోనూ రాణిస్తాం అని టీవీ9 లైవ్ షోలో కేటీఆర్ వెల్లడించారు.. లైవ్ షో వివరాలు ఆయన మాటల్లోనే..
‘గతంలో పలు సందర్భాల్లో చెప్పాం. ఉద్యమ పార్టీగా ఎన్నో ఎత్తు పల్లాలు చూశాం. 14 ఏండ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మా పార్టీ అంతర్దానం అవుతుంది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీలో పార్టీని మెర్జర్ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. మా అదృష్టం అది జరుగలేదు. అలా జరగక పోవడం వల్ల తెలంగాణ ప్రజల అదృష్టం కూడా.. తెలంగాణ కంటూ ఒక బలమైన గొంతు ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు ఎన్నికలకు వెళ్లిపోయాం. 2014లో అధికారంలోకి వస్తామని కలలో కూడా అనుకోలేదు. అధికారంలోకి వచ్చాం. తెలంగాణ వస్తే చాలనుకుని వచ్చినవాళ్లం. పదేండ్లు అధికారం ఇచ్చినరు..కాబట్టి వారికి సర్వధా.. శతధా రుణ పడి ఉంటాం.. ఇప్పుడు మాకు కొత్త పాత్ర ఇచ్చారు. పదేండ్లు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కొత్త పాత్ర.. 39 సీట్లలో గెలిపించి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. ఆ పాత్రలో కూడా రాణిస్తాం’ అని చెప్పారు.