నల్లగొండ : జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సొంతనిధులతో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి నల్లగొడ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి సినీ నటుడు ఆర్.నారాయణమూర్తితో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా ఎమ్మెల్యే స్వయంగా పలుగుపార పట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సినీనటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. సొంతూరిలో కృష్ణారెడ్డి కూతురు కీ.శే. కుమారి కంచర్ల మానస పేరిట ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. తల్లిదండ్రలని ప్రేమించలేని వాడు ఊరుని ప్రేమించలేడు. ఊరుని ప్రేమించలేనివాడు ప్రజలను ప్రేమించలేడన్నాడు.
కానీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులు తల్లిదండ్రులను ప్రేమిస్తారు., ఊరిని ప్రేమిస్తారు.ప్రజలను ప్రేమిస్తారని అన్నారు. అందుకే మన పూర్వీకులు చెప్పినట్లుగా ఏ ఊరికి అయినా బడి, గుడి, హాస్పిటల్ అనేవి అవసరమని, అందుకే వారు తన ఊర్లోనే గుడి, బడితో పాటు కృష్ణారెడ్డి పాప మానస పేరిట హాస్పిటల్ ని నిర్మించటం సంతోషకరమన్నారు.
ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కంచెర్ల సోదరులకు ధన్యవాదములని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాటి నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad |టీఆర్ఎస్వీ నేతలపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ గుండాలు
కాన్పు సమయంలో కడుపులో దూది.. తీవ్రమైన నొప్పితో మహిళ మృతి
సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులకు జలకళ : మంత్రి ఎర్రబెల్లి
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. శరీరంపై కత్తిపోట్లు