MLC Elections | హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
నల్లగొండ – వరంగల్ – ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి అంజిరెడ్డిని ఎంపిక చేసినట్టు కిషన్ రెడ్డి ప్రకటించారు.
సరోత్తమ్ రెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రధానోపాధ్యాయుడిగా 10 ఏండ్లు, స్కూల్ అసిస్టెంట్ టీచర్గా 21 ఏండ్లు పని చేశారు. 2012 నుంచి 2019 దాకా పీఆర్టీయూ జనరల్ సెక్రటరీగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు సరోత్తమ్ రెడ్డి.
పెద్దపల్లికి చెందిన మల్క కొమరయ్య.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ పట్టా పుచ్చుకున్నారు. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్లో అనేక విద్యా సంస్థలను నెలకొల్పారు. పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కు చైర్మన్గా సేవలందిస్తున్నారు.
మెదక్ జిల్లాలోని రామచంద్రాపురానికి చెందిన సీ అంజిరెడ్డి బీఏ పూర్తి చేశారు. పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అంజిరెడ్డి భార్య గోదావరి.. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. గత రెండు దశాబ్దాల నుంచి ఎస్ఆర్ ట్రస్ట్ను అంజిరెడ్డి నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటిని అందించేందుకు ఎస్ఆర్ ట్రస్ట్ తోడ్పాటును అందిస్తుంది. అంతేకాకుండా పేద విద్యార్థులకు విద్యా, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
ఇవి కూడా చదవండి..
KTR | ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిసిన కేటీఆర్
Aarogyasri | రూ. 1200 కోట్ల బకాయిలు.. ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలు నిలిపివేత