భూదాన్పచంపల్లి: మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్య కర్తలు శనివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్ పీసర్ల మంజుల మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు సరసాని నర్సిరెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు అంతటి అశోక్ గౌడ్, బీజేఈ గ్రామాధ్యక్షుడు దోంతరమోని భగవాన్ గౌడ్ల నేతృత్వంలో సుమారు 50 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాలకు ఆకర్శితులై చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధా కర్రెడ్డి, సిగిల్విండో చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, సర్పంచ్ సామ రవీందర్రెడ్డి, నాయకులు మేకల రవీందర్రెడ్డి, పీసర్ల రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.