జనగామ : ప్రభుత్వ హాస్పిటల్స్లో కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించి, ప్రజల్లో నమ్మకం కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కొవిడ్ నియంత్రణ చర్యలు, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్ పాజిటివ్ రేట్ 20 శాతం ఉందన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కొవిడ్ మహమ్మారి నియంత్రణకై పనిచేయాలన్నారు.ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నట్లు, కోవిడ్ లక్షణాలు ఉన్న 5 వేల 510 మందికి ఇంటి వద్దనే మందులతో కూడిన హెల్త్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడానికి 7 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
జిల్లాలో పడకలు, ఆక్సిజన్, రెమిడిసిర్ ఇంజక్షన్ల కొరత లేదని మంత్రి తెలిపారు. ఆక్సిజన్ బెడ్లను పెంచడానికి వెంటనే చర్యలు చేపట్టామన్నారు. పరిశుభ్రత చాలా ముఖ్యమని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా సర్పంచులు, కార్యదర్శులు కృషి చేయాలని ఆదేశించారు. బాలవికాస, ఎమ్మెల్యేల, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని అన్నారు.
జిల్లా కేంద్రంలో 8247847692 నెంబర్తో కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా హెల్త్ కిట్లు అందజేసినవారికి నేరుగా ఫోన్ చేసి వారి ఆరోగ్య సమాచారం, సేవల గురించి తెలుసుకొని అవసరమైన పక్షంలో ఇంకా మెరుగైన సేవల వైద్యుల దృష్టికి తీసుకెళ్లొచ్చాన్నారు.
సమావేశంలో కలెక్టర్ కె. నిఖిల, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, ఏసీపీ వినోద్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్త దితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
ఏరియా హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే చల్లా
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్