అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగును మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల్లోని పల్లెవెలుగు బస్సుల రంగులను మార్చాలని ఆదేశాలను జారీ చేశారు. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి.
వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వినియోగించబోతున్నారు. ఇదే సమయంలో డిజైన్ను కూడా మార్చబోతున్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
భారత్, రష్యా మధ్య పలు రక్షణరంగ ఒప్పందాలు
చరిత్రలో ఈరోజు : బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి 29 ఏండ్లు