నల్లగొండ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా నల్గొండ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి హాజరయ్యారు. దళితుల పట్ల నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి కలిగిన ఏకైక నేత కేసీఆర్ ఎమ్మెల్యే పేన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్, మార్కెట్ చైర్మన్ సుధాకర్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ జిల్లా శంకర్, పట్టణ అధ్యక్షుడు రామరాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, కొండూరు సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా